Test Footer 2

01:20
0

టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలు రెండు ఈ సంక్రాంతి బరిలో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, వెంకటేష్ ల మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇందులో ఒకటి కాగా, మరొకటి రామ్ చరణ్ తేజ 'నాయక్' సినిమా. ఇలా రెండు పెద్ద పెద్ద సినిమాలు ఒకే వారంలో విడుదల కావడం వలన వాటి కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. 
దీంతో రామ్ చరణ్ తరుపున రంగంలోకి దిగిన మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజ్ ని వాయిదా వేయవలసిందిగా నిర్మాత దిల్ రాజుని కోరడం జరిగింది. ఈ విషయం ప్రిన్స్ మహేష్ బాబు చెవిన పడింది. వెంటనే దిల్ రాజుని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. ముందు అనుకున్న సమయానికి గనుక ఈ సినిమాని రిలీజ్ చెయ్యకపోతే తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అని గట్టిగా హెచ్చరించడం జరిగింది.